Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Khammam

ఖమ్మం కార్పొరేషన్ వద్ద భారీ ధర్నా

15 Sep 2026, 09:08 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
ఖమ్మం కార్పొరేషన్ వద్ద భారీ ధర్నా - ఖమ్మం, तेलंगाना

పేదల ఇళ్ల తొలగింపు నోటీసులను ఉపసంహరించుకోవాలి!

ఖమ్మం కార్పొరేషన్ వద్ద భారీ ధర్నా

ఖమ్మం, 15 సెప్టెంబర్ : ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో గత యాభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను తొలగించాలని మున్సిపల్ అధికారులు అందించిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సమస్య పైన మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా బాధితులతో సిపియం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం ఖమ్మం డివిజన్ నాయకులు ఎస్కే సైదులు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత యాబై సంవత్సరాల నుండి శ్రీనివాస నగర్ ప్రాంతంలో పక్కా ఇళ్లను నిర్మించుకొని వేల మంది పేదల నివసిస్తున్నారని, అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది అని ఇప్పుడు ఆ ఇళ్ల నిర్మాణాలని తొలగించాలని మునిసిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. గత 50 సంవత్సరాల నుండి మున్సిపల్ టాక్స్ లు, కరెంట్ బిల్లులు కడుతున్నారు అని తెలిపారు.రోజు వారీ కూలీ పనులు,వివిధ చేతి వృత్తులు చేసుకుంటూ సాదాసీదా జీవనాన్ని కొనసాగించే పేదలపైన ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ప్రతాపం చూపడం పద్ధతి కాదని అన్నారు. ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతమని, 60 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు విస్తరణ అనే పేరు మీద పేదలని ఈ ప్రాంతం నుండి తరిమి వేయాలనే దుర్దేశంతో కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం నుండి పేదలు వెళితే తమ ఆస్తులకి విలువలు పెరుగుతాయనే దురుద్దేశంతోనే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు పేదల ఇళ్లను తొలగించమని నోటీసులు ఇచ్చారని, 15 రోజుల్లో తొలగించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరికలు జారీ చేశారని అన్నారు. ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకొని , పేదలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.గౌరవ మంత్రి పేదల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఈ సమస్య మరో వెలుగుమట్లగా మారుతుందని హెచ్చరించారు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా టింబర్ (చెక్క కోత మిషన్ లు) పరిశ్రమలు వుండటం ఫలితంగా ఈ ప్రాంతం ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం అంతా నివాస ప్రాంతాలు వెంటనే ఇక్కడ నుండి ఈ చిన్న తరహా పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి, వివిధ స్కూల్స్, పెట్రోల్ బంక్ లు వుండటం వల్ల ఈ టింబర్ చెక్క కోత పరిశ్రమలను దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ మిషన్ లు ఫలితంగా చెక్క దుమ్ము ధూళి తో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు.
బాధితులు అధైర్యపడవద్దని, సిపీయం పార్టీ అండగా ఉంటుందని,అందుకు అవసరమైన ప్రజా పోరాటాల్ని,న్యాయ పోరాటాల్ని నిర్వహిస్తామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.అనంతరం మున్సిపల్ అధికారులకు బాధితులతో కలిసి వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో సిపియం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్,పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రనివాసరావు,మెరుగు సత్యనారాయణ, త్రీ టౌన్ కార్తదర్శి భుక్యా శ్రీనివాసరావు,జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, డివిజన్ నాయకులు యర్రా గోపి, వజినేపల్లి శ్రీనివాసరావు,బండారు యాకయ్య, SK ఇమామ్,యర్రా రంజిత్, బండారు సునీత తదితరులు పాల్గొన్నారు.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

हार्टफुलनेस मेडिटेशन सेंटर के ध्यान सत्र के साथ “नशा मुक्त युवा फॉर विकसित भारत अभियान” के तहत जागरूकता कार्यक्रम
Jodhpur20 Sep

हार्टफुलनेस मेडिटेशन सेंटर के ध्यान सत्र के साथ “नशा मुक्त युवा फॉर विकसित भारत अभियान” के तहत जागरूकता कार्यक्रम

जोधपुर : युवाओं को मानसिक रूप से मजबूत बनाने, सकारात्मक सोच विकसित करने और नशे जैसी सामाजिक बुराई…

पूरी खबर पढ़ें →
कस्बा बावड़ी में बहुचर्चित गेनाराम हत्याकाण्ड में 02 साल से फरार ईनामी अपराधी सीताराम गिरफ्तार
Jodhpur (Gramin)20 Sep

कस्बा बावड़ी में बहुचर्चित गेनाराम हत्याकाण्ड में 02 साल से फरार ईनामी अपराधी सीताराम गिरफ्तार

जोधपुर : पुलिस मुख्यालय द्वारा वांछित व ईनामी अपराधियों की गिरफ्तारी हेतू राज्यभर में चलाये जा रहे विशेष…

पूरी खबर पढ़ें →
200 से अधिक महिलाओं एवं बालिकाओं ने सीखे आत्मरक्षा हेतु लिया प्रशिक्षण
Jodhpur20 Sep

200 से अधिक महिलाओं एवं बालिकाओं ने सीखे आत्मरक्षा हेतु लिया प्रशिक्षण

जोधपुर : अनंत श्री सुखराम जी ट्रस्ट राम धाम राम चौकी बिराई जोधपुर एवं पुलिस आयुक्तालय जोधपुर द्वारा…

पूरी खबर पढ़ें →
मुख्यमंत्री, बिहार के गया आगमन के मद्देनजर नगर पुलिस अधीक्षक गया द्वारा गांधी मैदान, गया का निरीक्षण किया गया l
Gaya20 Sep

मुख्यमंत्री, बिहार के गया आगमन के मद्देनजर नगर पुलिस अधीक्षक गया द्वारा गांधी मैदान, गया का निरीक्षण किया गया l

आज दिनांक 20.09.2026 को माननीय मुख्यमंत्री, बिहार के गया आगमन के मद्देनजर नगर पुलिस अधीक्षक, गया द्वारा गांधी…

पूरी खबर पढ़ें →
उप विकास आयुक्त ने किया पॉलिटेक्निक परीक्षा केंद्र का भ्रमण
Dhanbad20 Sep

उप विकास आयुक्त ने किया पॉलिटेक्निक परीक्षा केंद्र का भ्रमण

जिला जनसंपर्क कार्यालय धनबाद 20 सितंबर 2026 राष्ट्रीय स्वास्थ्य मिशन कार्यक्रम के अंतर्गत 12 श्रेणियों के रिक्त पदों…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!